![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కళ్ళు చెమ్మ కాక మానవు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే. ఈరోజున ఈ షో లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ గా రాబోతోంది. అలాగే అందరికీ ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ తల్లిని అందరూ స్మరించుకున్నారు. నిజంగా ఆమె గురించి పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన ఆ తల్లిని ఎన్నో సార్లు స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతీ ప్రసంగంలో ఆమెను తలుచుకోకుండా ఉండరు...ఏ దానానికి ఆ దానం గొప్పది కానీ అలాంటి దానాల్లోకెల్లా అన్నదానం ఇంకా గొప్పది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వచ్చిన వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆ మహనీయురాలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆమె గురించి తెలిసేలా చేసారు. ఆ తరువాత ఇంద్రజ ఆ విషయాన్ని ప్రస్తావించారు. "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరుతో అన్నదానం జరిపించాలని అని చెప్పిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆవిడ మీద అందరికీ ఒక అవగాహన వస్తోంది" అని చెప్పారు.
.webp)
అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అన్నా క్యాంటిన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటిన్లు రావాలి అంటూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఆకలి అంటూ తన ఇంటికి ఎవరు వచ్చినా ఆమె కాదు, లేదు, పెట్టలేను అనే వారు కారట. ఈ అన్నదానం కార్యక్రమం వలన ఆమె ఆస్తులన్నీ కరిగిపోయి కష్టాలొచ్చినా కూడా ఆమె వెనకడుగు వేయకుండా నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారట. అందుకే ఆమె పేరు తలచుకున్నా ఆమె దాన గుణం గురించి స్మరించుకున్నా ఎక్కడా లేని ధైర్యం వస్తుంది అంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఆమె గురించి ప్రసంగించినప్పుడల్లా ఆయన మాటల్లో ఎదో తెలియని ధైర్యం కనిపిస్తుంది. ఇక ఇలా ఈ వారం షో మహిళల కోసం రూపొందించారు.
![]() |
![]() |